విద్యా సామర్థ్యాలు పెంచాల్సిన బాధ్యత టీచర్స్​దే: కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్

విద్యా సామర్థ్యాలు పెంచాల్సిన బాధ్యత టీచర్స్​దే: కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంచాల్సిన బాధ్యత టీచర్స్​దేనని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో ఎంఈవోలు, కాంప్లెక్స్​ హెచ్​ఎంలు, హైస్కూల్స్​ హెచ్​ఎంలతో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. విద్యార్థులలో వంద శాతం సామర్థ్యాలు పెంపొందించేందుకు టీచర్స్​ సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పనులను స్పీడ్​గా చేస్తున్నామన్నారు. స్కూళ్లలో ఔషధ మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో స్టూడెంట్స్​కు ఇంటి వద్ద రాత పనిని ప్రోత్సహించేందుకు నోట్​ బుక్స్​ అందిస్తున్నామని చెప్పారు. మ్యాథ్స్​లో స్టూడెంట్స్​ను అద్బుతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని టీచర్లకు సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, ఎగ్జామ్స్​ అసిస్టెంట్​ కమిషనర్​ మాధవరావు, జిల్లా అకడమిక్​ మానిటరింగ్​ ఆఫీసర్​ ఎ. నాగరాజశేఖర్​, సైన్స్​ ఆఫీసర్​ చలపతి రాజు పాల్గొన్నారు.