ఇయ్యాల (ఏప్రిల్ 24న) కలెక్టరేట్​లో దిశ మీటింగ్ : కలెక్టర్​ జితేష్​ వి పాటిల్

ఇయ్యాల (ఏప్రిల్ 24న) కలెక్టరేట్​లో దిశ మీటింగ్ : కలెక్టర్​ జితేష్​ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) కమిటీ మీటింగ్​ గురువారం కలెక్టరేట్​లో నిర్వహించనున్నట్లు కలెక్టర్​ జితేష్​ వి.పాటిల్​ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఖమ్మం ఎంపీ  రామసహాయం రఘురామిరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మీటింగ్​ జరుగుతుందని తెలిపారు.  కో చైర్మన్​గా మహబూబాబాద్​ ఎంపీ బలరాం నాయక్​ వ్యవహరించనున్నారన్నారు.  

జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు దిశ కమిటీ మెంబర్స్​, అన్ని శాఖల జిల్లా అధికారులు  మీటింగ్​లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. జిల్లా ఆఫీసర్లంతా మీటింగ్​కు తమ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనులతో, పూర్తిస్థాయి నివేదికలతో అటెండ్​ కావాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి జరిగే దిశ మీటింగ్​ కోసం ప్రజాప్రతినిధులు రోజంతా కేటాయిస్తే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.