
నారాయణపేట, వెలుగు: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన సాధారణ కాన్పులు, సిజేరియన్ ఆపరేషన్ల వివరాలు అందించాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్ల వివరాలు, చేసిన స్కానింగ్ వివరాలు తెలియజేయాలన్నారు. డీఎంహెచ్వో సౌభాగ్య లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ వో శైలజ, డీఎంవో అశోక్ కుమార్ పాల్గొన్నారు.