![పోతిరెడ్డిపల్లి హై స్కూల్ను తనిఖీ చేసిన కలెక్టర్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-kranti-inspected-pothireddypalli-high-school_U7j2mC9hx0.jpg)
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి హై స్కూల్ను కలెక్టర్క్రాంతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ప్రతిభా, సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో కీలకమైనదన్నారు.
స్టూడెంట్స్ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదువుకునేలా టైం టేబుల్ రూపొందించుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను హెచ్ఎంలు స్కూల్ అవసరాలకు ఖర్చు చేయాలని, కొనుగోలు చేసిన సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.