కోల్బెల్ట్, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సహకారం అందిస్తోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.
సర్కార్అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. క్యాంటీన్లో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు విక్రయించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మందమర్రి తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వినతి
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లను కేటాయించాలని కోరుతూ మందమర్రి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ నేతృత్వంలో పాత్రికేయులు కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. ఏళ్లుగా తమ సమస్య పరిష్కారం కావడంలేదని, కాంగ్రెస్సర్కార్ జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు.