
- పట్టు వస్త్రాలు ఇక్కడే తయారుచేసేలా చర్యలు
- దసలి పట్టు కృషి కిసాన్ మేళాలో కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ దసలి పట్టు క్వాలిటీలో దేశంలోనే నంబర్ వన్గా నిలువడం గర్వకారణమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూర్లోని సెరీకల్చర్ గోదాముల ఆవరణలో దసలి పట్టు కిసాన్ కృషి మేళాను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పట్టు గూళ్లు ఉత్పత్తి చేసే రైతులు పాల్గొన్నారు. దసలి పట్టు ఉత్పత్తిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వారు ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన పట్టుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దసలి పట్టు రైతులకు సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.
పట్టు వస్త్రాలను ఇక్కడే తయారు చేసేందుకు అవసరమైన మెషీన్లుకొనుగోలు చేసి రైతులకు ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పట్టు రైతులు పట్టు వస్ర్తాలను స్టాల్స్లో ప్రదర్శించారు. సెరీకల్చర్, హార్టికల్చర్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ ఎం.లత, జిల్లా అధికారి అనిత, చెన్నూర్ ఏడీ రాథోడ్ పార్వతి, సైంటిస్ట్ డాక్టర్ భగవాన్దాస్ పాల్గొన్నారు.