ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్​ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి :   కలెక్టర్ ​మనుచౌదరి

ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్​ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి :   కలెక్టర్ ​మనుచౌదరి

కోహెడ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్​ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో కంప్యూటర్​ల్యాబ్​లను ఏర్పాటు చేశామని కలెక్టర్​మనుచౌదరి అన్నారు. గురువారం మండలంలోని శనిగరం, కోహెడ హైస్కూళ్లలో కంప్యూటర్​ ల్యాబ్​లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్స్​ఆర్థిక ఇబ్బందులను పక్కన బెట్టి అనుకున్న లక్ష్యంపైనే గురిపెట్టాలన్నారు.

కంప్యూటర్​ల్యాబ్​లను సద్వినియోగం చేసుకునేలా టీచర్లు కృషి చేయాలన్నారు. ప్రతి రోజు వార్తా పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. టీచర్స్​స్టూడెంట్స్​ని స్టేజీ మీద మాట్లాడిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. కోహెడ, శనిగరం, అంతక్కపేట స్కూళ్లల్లో రూ.50 లక్షలతో ల్యాబ్​లను ఏర్పాటు చేసేందుకు సహకరించిన టీఎస్​ఐజీ డైరెక్టర్​అర్చన సురేశ్, సేల్స్​ఫోర్సెస్​సంస్థ ప్రతినిధి మాధురీ కనకాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్​రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్​ సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంఈవో పద్మయ్య ఉన్నారు.