స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలి : కలెక్టర్ మనుచౌదరి

స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట, వెలుగు: హాస్టల్​ స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలని కలెక్టర్​మనుచౌదరి సూచించారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేటలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగాతనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూంలను పరిశీంచారు. కొత్త మెనూ ప్రకారం స్టూడెంట్స్​కు శుభ్రమైన ఆహారం పెట్టాలన్నారు. సరుకుల ఎక్స్​పైరీ డేట్ చూసి వినియోగించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం పదో తరగతి స్టూడెంట్స్​తో కాసేపు మాట్లాడారు. అన్ని సబ్జెక్ట్ లపై పట్టు సాధించి, పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని  ప్రిన్సిపాల్ నాగలతకు సూచించారు.