
- కలెక్టర్లు మనుచౌదరి, క్రాంతి
సిద్దిపేట రూరల్, వెలుగు : మీడియా సెంటర్ ద్వారా ఎన్నికల వివరాలు అందించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో లోక్సభ ఎన్నికల మీడియా సెంటర్ ను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీవిజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. అనంతరం నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్, సీ విజిల్ సెంటర్ ను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రహమాన్, ఎలక్షన్ సూపరింటెండెంట్ మధుసూదన్ పాల్గొన్నారు.
5 కే రన్ ప్రారంభం
లోక్ సభ ఎన్నికల ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానం నుంచి 5కే రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ మను చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా కీలకమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, డీఆర్డీవో జగదేవ్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియాసెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి, అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మజారాణి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు, ఏవో పరమేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు