
హాలియా, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం వహించిన నల్గొండ జిల్లా గుర్రంపోడు ఎంపీడీవో మంజులను కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామపంచాయతీలకు గడ్డికోత యంత్రాలను కొనుగోలు చేయకపోవడం, మొక్కలు పెంపకం, పారిశుధ్యం, కంపోస్ట్ షెడ్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఎంపీడీవోను సస్పెండ్ చేశారు.