లబ్ధిదారుల గుర్తింపులో స్పీడ్​​ పెంచాలి : కలెక్టర్​ సత్య శారదా దేవి

లబ్ధిదారుల గుర్తింపులో స్పీడ్​​ పెంచాలి :  కలెక్టర్​ సత్య శారదా దేవి

కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథంకలో భాగంగా రెండో విడత ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల గుర్తించే ప్రక్రియ స్పీడప్​ చేయాలని వరంగల్​ కలెక్టర్​ సత్య శారదా దేవి ఆదేశించారు. శనివారం గ్రేటర్​ సిటీలోని 18వ డివిజన్​లో క్రిస్టియన్​కాలనీ, నర్సాపూర్​, ఖానాపురంలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల గుర్తింపు సర్వీ తీరును కలెక్టర్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఖానాపురం అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హుల గుర్తింపు పారదర్శకంగా, జవాబుదారీతో జరగాలన్నారు. ఈనెల 30 వరకు ప్రక్రియ పూర్తికావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామిరెడ్డి, హోసింగ్ ప్రాజెక్ట్ అధికారి గణపతి తదితరులు పాల్గొన్నారు.