
మెదక్టౌన్, వెలుగు: మెదక్లో పట్టణంలోని డ్రగ్ స్టోర్, ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్రాజ్శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్టోర్లో మందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మెదక్ ఏరియా ఆస్పత్రిలో టీకాల నిల్వ గదిని తనిఖీ చేశారు. అక్కడే కంటి పరీక్ష చేయించుకున్నారు. ఫిజియోథెరపీ సెంటర్ సేవల గురించి జిల్లా వైద్య అధికారి శ్రీరామ్ను అడిగి తెలుసుకున్నారు.
డెంటల్ విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. డ్రగ్ స్టోర్ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలకు సకాలంలో మందుల సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వంద శాతం ఇమ్యునైజేషన్ సేవలందించాలన్నారు. కలెక్టర్వెంట డీసీహెచ్వో శివదయాల్, డాక్టర్శివరామ్, ఇమ్యూనైజేషన్అధికారిని మాధురి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ మల్కాజి, సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఏఐ అమలుకు వసతులు కల్పిస్తాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద జిల్లాలో ఎంపికైన స్కూల్స్లో అవసరమైన వసతులు కల్పిస్తామని కలెక్టర్రాహుల్రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమం కింద తూప్రాన్ , మనోరాబాద్ మండలం కాళ్లకల్, నర్సాపూర్ నెంబర్- -2, హవేళీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట ప్రైమరీ స్కూల్స్ఎంపికయ్యాయన్నారు. ఈ స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తామని కలెక్టర్తెలిపారు.