ఇంటర్ ​పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : రాహుల్ రాజ్

ఇంటర్ ​పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు :  రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్​, వెలుగు:  జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్​పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. శుక్రవారం మెదక్​కలెక్టరేట్​లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 30 సెంటర్లలో 6,238 మంది స్టూడెంట్స్​పరీక్ష రాయనున్నారని తెలిపారు. ప్రతి సెంటర్ కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. కాంపౌండ్ లేని పరీక్ష కేంద్రాలకు బారికేడ్లను అడ్డుగా పెట్టాలన్నారు. 

విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని సూచించారు. స్టూడెంట్స్​ఇబ్బంది పడకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్​అధికారి మాధవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ సహజం

ప్రతి ఉద్యోగికి విరమణ సహజమని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం  మెదక్​డీపీఆర్​వో ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న కిషోర్ బాబు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్​ తన ఆఫీసులో కిషోర్ బాబును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీపీఆర్​వో  రామచంద్రరాజు, కిషోర్ బాబు కుటుంబ సభ్యులు, ఏపీఆర్ వో బాబూరావు, ప్రసాద్ పాల్గొన్నారు.