![పార్కింగ్ కు పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rahul-raj-has-ordered-the-officials-to-take-strict-measures-for-parking-management-in-the-edupayala-jatara_pWokPavDCS.jpg)
మెదక్టౌన్, వెలుగు : ఏడుపాయల జాతరలో పార్కింగ్ నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మెదక్ కలెక్టరేట్ లో జాతర ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ నగేశ్, దేవాదాయ, పోలీస్, జీపీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
జాతరలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయలన్నారు. అనంతరం జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, డీపీవో యాదయ్య, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత పోలీస్, దేవాదాయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జీపీ ఎన్నికల్లో స్టేజ్-2 ఆఫీసర్ల పాత్ర కీలకం
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్ -2 అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అన్నారు. మెదక్కలెక్టరేట్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జీపీ ఎన్నికల్లో స్టేజ్ - 2 అధికారులు కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే ఆఫీసర్లుగా ఉంటారన్నారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు నిబద్ధతతో పని చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, డీఈవో రాధాకిషన్, డీఎస్వో రాజిరెడ్డి, ఆర్డీవో రమాదేవి, స్టేజ్-2 అధికారులు పాల్గొన్నారు.