
మెదక్, వెలుగు: లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు మెదక్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మెదక్లోక్సభ రిటర్నింగ్ఆఫీసర్, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల18న ఎలక్షన్నోటిఫికేన్జారీ అవుతుందని, అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. రికగ్నైజ్డ్ పొలిటికల్పార్టీలు, అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల తరుపున, ఇండిపెండెంట్అభ్యర్థులు నామినేషన్దాఖలు చేయొచ్చన్నారు.
మెదక్ ఇంటిగ్రేటెడ్కలెక్టరేట్ లోని తన చాంబర్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ సందర్భంగా అభ్యర్థితో కలుపుకుని ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ రోజుకు ఆరోజు దాఖలైన నామినేషన్ల వివరాలు, అభ్యర్థుల అఫిడవిట్లనుఎంసీఎంసీ లో నోటీస్బోర్డుమీద డిస్ప్లే చేస్తామని పేర్కొన్నారు.
రూ.28.89 లక్షలు సీజ్
ఇప్పటి వరకు తనిఖీల్లో 19 మంది నుంచి రూ.28,89,830 సీజ్ చేశామని కలెక్టర్తెలిపారు. ఇందులో 13 మంది గ్రీవెన్స్ సెల్కు అప్లై చేసుకోగా సరైన పత్రాలు చూపించిన 11 మందికి సంబంధించి రూ.15,21,730 రిలీజ్ చేశామని చెప్పారు. సరైన ప్రూఫ్స్సబ్మిట్చేయని 8 మందికి సంబంధించిన రూ.13,68,100 పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎంసీసీ ఉల్లంఘనకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు. ఎక్సైజ్డిపార్ట్మెంట్102 కేసులు నమోదు చేయగా తనిఖీల్లో రూ.93,57,003 విలువైన 98,490 లీటర్ల మద్యం సీజ్ చేశామని చెప్పారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.