స్టూడెంట్స్ ​చదువుపై దృష్టిపెట్టాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్​

స్టూడెంట్స్ ​చదువుపై దృష్టిపెట్టాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్​
  • బూర్గుపల్లి జడ్పీ హైస్కూల్​ను తనిఖీ చేసిన కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: ఎగ్జామ్స్​ సమయంలో స్టూడెంట్స్​ చదువుపై దృష్టి పెట్టాలని, సెల్​ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. శుక్రవారం ఆయన హవేలీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లి జడ్పీ హైస్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​క్లాస్​రూమ్స్​, కిచెన్​ పరిశీలించి స్టూడెంట్స్​తో మాట్లాడారు. వారికి మ్యాథ్స్​, సైన్స్, ఇంగ్లిష్​ పాఠాలను బోధించారు. టెన్త్​స్టూడెంట్స్​ను సిలబస్ ​రివిజన్ చేశారా లేదా అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన స్టూడెంట్స్​పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని టీచర్లకు సూచించారు. ఇంటివద్ద తల్లిదండ్రులు పిల్లలను చదివించాలన్నారు. కలెక్టర్ ​వెంట హెడ్మాస్టర్​, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

పెండింగ్ ​పనులను పూర్తి చేయాలి

జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న అభివృద్ధి​పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులకు సూచించారు. మెదక్ కలెక్టరేట్​లో రామాయంపేట మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖలకు సంబంధించిన వివిధ దశల్లో ఉన్న పనులను అధికారులు పరిశీలించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు.