
మెదక్ టౌన్, వెలుగు: పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఇరిగేషన్అధికారులను ఆదేశించారు. సోమవారం వనదుర్గా ప్రాజెక్ట్ నుంచి సాగునీరందించే మహబూబ్నహర్కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 4.06 టీఎంసీల సాగునీరు వనదుర్గా ప్రాజెక్టుకు అలిగేషన్ ఉందన్నారు. జనవరి 15 నుంచి ఏప్రిల్-చివరి వరకు సాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూల్స్లో ఏఐ పక్కాగా అమలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కార్యక్రమాన్ని ప్రభుత్వ స్కూల్స్లో పక్కాగా అమలు చేస్తున్నామని కలెక్టర్రాహుల్రాజ్ తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో డీఈవో రాధాకిషన్ ఆధ్వర్యంలో ఏఐ సాఫ్ట్వేర్ రూపొందించిన బెంగళూరు బృందంతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్సమస్యలను నివృత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏఐ సాఫ్ట్వేర్బృంద సభ్యులు అనంతి ఆకాశ్, ప్రీతి ఉన్నారు.