
టేక్మాల్, వెలుగు: ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హుల గుర్తింపుకోసం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రూపొందించిన వివరాలను సోమవారం టేక్మాల్లో కలెక్టర్ రాహుల్రాజ్తనిఖీ చేశారు. అనంతరం గ్రామ సభల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహణ సమాచారం ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని ఆదేశించారు. గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా చదివి వినిపించి తుది జాబితా తయారు చేయాలన్నారు.