
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలో పార్లమెంట్ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను కేటాయించామన్నారు. త్వరలో నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకరూప ధరల పట్టికను ధ్రువీకరించి పొలిటికల్పార్టీల నాయకులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు, పొలిటికల్పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేయాలి
జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 6వ తేదీ నుంచి కళాజాత కార్యక్రమాలు, 5 కే రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. రాజిరెడ్డి, శ్రీనివాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య , బ్రహ్మాజీ పాల్గొన్నారు.
ఎన్నికల సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలి..
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, సిబ్బందికి శిక్షణ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. మెదక్పట్టణంలోని తారకరామానగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 4, 6 తేదీల్లో పీవోలు, ఏపీవోలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్వెంట ఆర్డీవో రమాదేవి, డీఎస్వో రాజిరెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, రజని కుమారి పాల్గొన్నారు.