మనిషికి ఆధార్.. భూమికి భూధార్ ​ఉండాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మనిషికి ఆధార్.. భూమికి భూధార్ ​ఉండాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

చిలప్ చెడ్, పాపన్నపేట, టేక్మాల్, వెలుగు: మనిషికి ఆధార్​ఎలాగో భూమికి భూధార్​ ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం ఆయన  చిలప్ చెడ్, టేక్మాల్ మండల రైతు వేదికల్లో, పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో భూభారతి చట్టంపై  రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. భూ సమస్యలు తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ధరణి పోర్టల్​లో పరిష్కారం కాని అనేక సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారమవుతాయన్నారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

తహసీల్దార్​ స్థాయిలో న్యాయం జరగదని భావిస్తే ఆర్డీవో, కలెక్టర్​కు అప్పీల్​ చేసుకోవచ్చని సూచించారు. రైతులకు పవర్​పాయింట్​ప్రజంటేషన్​ద్వారా చట్టంలోని అన్ని వివరాలను  తెలియజేశారు. అనంతరం ఎల్లుపేటలో ఇటీవల మంజూరైన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​ సుహాసిని రెడ్డి, ఆర్డీవోలు మహిపాల్ రెడ్డి, రమాదేవి, ఏడీఈ పుణ్యవతి, ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులు, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు