గురుకులాల్లోని స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

గురుకులాల్లోని స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​టౌన్, వెలుగు: గురుకులాల్లోని స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్​ రాహుల్​రాజ్ సూచించారు. శనివారం ఆయన  హవేలీ ఘనపూర్​ మండలం కేంద్రంలోని మహాత్మా గాంధీ,  జ్యోతిభాపూలే స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీచర్లు, సిబ్బంది హాజరు, సరుకుల స్టాక్​, అకౌంట్ రిజిస్టర్లను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. వంటల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం 9వ తరగతి స్టూడెంట్స్​తో మాట్లాడారు. వెనుకబడి ఉన్న స్టూడెంట్స్​పై శ్రద్ధ చూపాలని టీచర్లకు సూచించారు. కలెక్టర్​ వెంట టీచర్లు, సిబ్బంది ఉన్నారు.