మెదక్​ జిల్లా పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​ జిల్లా పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. మంగళవారం మెదక్​కలెక్టరేట్​లో వివిధ మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్​లైన్​లో  అప్​లోడ్​చేయాలన్నారు.

జిల్లాలో మూడు వేల ధరణి దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ధరణి దరఖాస్తులను తిరస్కరించినట్లయితే అందుకు స్పష్టమైన కారణాలు తెలియజేయాలన్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.