అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు :  కలెక్టర్​రాహుల్​రాజ్

అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు :  కలెక్టర్​రాహుల్​రాజ్
  • ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్​ ​చేసిన కలెక్టర్

మెదక్ టౌన్, వెలుగు: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​రాహుల్​రాజ్​ హెచ్చరించారు. శనివారం ఆయన మెదక్​పట్టణంలోని గోల్కొండ వీధి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎంహెచ్​వో శ్రీరామ్​కు ఫోన్​చేసి  విధులకు గైరాజరైన మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ నర్సును సస్పెండ్ ​చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అప్పుడే ప్రజలు నమ్మకాన్ని 
చూరగొంటారన్నారు. 

ఉపాధి పనులు సక్రమంగా జరిగేలా చూడాలి

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలంలోని పర్వతాపూర్​, కాట్రియాల గ్రామాల్లో జరుగుతున్న  పనులను పరిశీలించారు. కాట్రియాలలోని జడ్పీ హైస్కూల్, అంగన్​వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. జడ్పీ హైస్కూల్​ను సందర్శించి స్టూడెంట్స్​ తో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని, మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్​ వెంట ఎంపీడీవో షాజొద్దీన్​, పంచాయతీ సెక్రటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.