
- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం మెదక్కలెక్టరేట్ లోఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ అవుతుందని, నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి,10, స్క్రూటినీ 11, నామినేషన్ల విత్డ్రా 13, పోలింగ్ 27న జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న ప్రారంభమమై 8 లోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. టెలీకాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్డీవోశ్రీనివాసరావు, ఆర్డీవోలు, తహసీల్దార్లు , ఎంపీడీవోలు పాల్గొన్నారు.
పోలింగ్బూతుల పరిశీలన
పాపన్నపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పాపన్నపేట హైస్కూల్లో రెండు గదులను ఎంపిక చేసినట్లు కలెక్టర్రాహుల్రాజ్ తెలిపారు. గురువారం వాటిని పరిశీలించి తరగతి గదులను చెక్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్కు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. టీచర్ల బోధన తీరును పరిశీలించి అభినందించారు .ఆయన వెంట తహసీల్దార్ సతీశ్, హెచ్ఎం మహేశ్, టీచర్ల
ఉన్నారు.