రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలె : కలెక్టర్​ రాజర్షి షా

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలె : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్​ఆఫీస్​లో రోడ్డు సేఫ్టీ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణకు బోర్డులు, సూచికలు, రేడియంతో చేసిన బోర్డులను ఏర్పాటు చేయాలని, హెల్మెట్​పై మరింత అవగహన కల్పించాలని అధికారులకు సూచించారు. మూలమలుపుల దగ్గర హెచ్చరికల బోర్డులు,  స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  

డ్రగ్స్​రవాణాపై నిఘా పెట్టాలి

డ్రగ్స్​రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్​రాజర్షి షా  అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్​పట్ల ప్రత్యేక నిఘా పెట్టాలని స్కూల్​, కాలేజ్​ పిల్లలను తరచుగా గమనించాలన్నారు. కిరాణ, మెడికల్ షాపులను తరచుగా చెక్​ చేయాలన్నారు. గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ రమేశ్, ఏఎస్పీ మహేందర్, డీఈవో రాధాకిషన్, డీఐఈవో సత్యనారాయణ, జిల్లా ఎక్సైజ్​సూపరింటెండెంట్​రజాక్​, డీఏవో గోవింద్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

సిద్దిపేట రూరల్ :  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ రూల్స్​ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఇన్‌చార్జి డీటీఓ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్​లో ట్రాఫిక్ రూల్స్​,  రోడ్డు ప్రమాదాల పై వాహనదారులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ జనార్దన్​ రెడ్డి, ఏఎంవీఐ శ్యామ్, రిచర్ట్ సన్, కానిస్టేబుల్ రవీందర్, జయలక్ష్మి, విక్టోరియా, ఆఫీస్ సిబ్బంది  పాల్గొన్నారు.