
మెదక్ టౌన్, వెలుగు: స్టూడెంట్స్ పరీక్షలంటే భయపడొద్దని, ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో టెన్త్ స్టూడెంట్స్కు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్మంచి మార్కులు సాధించేలా టీచర్లు ప్రోత్సహించాలన్నారు. హాస్టళ్లలో ఉండే స్టూడెంట్స్ కోసం ప్రత్యేక స్టడీ అవర్స్, ట్యూటర్లను నియమించి చదివించాలని సూచించారు.
టెన్త్ సబ్జెక్ట్లను నిర్లక్ష్యం చేయవద్దని ఇవి కేంద్ర ,రాష్ట్ర స్థాయి లో ఉండే సివిల్స్, గ్రూప్ 1,2,3 లాంటి పరీక్షలు ఉపయోగపడతాయని చెప్పారు. టీవీ , ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండి బాగా చదవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, జనరల్సెక్రెటరీ రాజ్కుమార్, శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.