
మెదక్ టౌన్, వెలుగు: పారిశ్రామిక వేత్తలు తమ వంతుగా సమాజానికి సాయం అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం మెదక్ కలెక్టర్ ఆఫీసులో జిల్లా పారిశ్రామికవేత్తల తో సీఎస్ఆర్ ఫండ్స్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లోని పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ తో సహకరించాలన్నారు.
ప్రతి పారిశ్రామిక కేంద్రం నుంచి 2 శాతం నిధులు సీఎస్ఆర్కు కేటాయించాలని సూచించారు. వీటిని విద్యా , వైద్యం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రమేశ్, జిల్లా పారిశ్రామిక అధికారి కృష్ణమూర్తి , కాలుష్య నియంత్రణ అధికారి కుమార్ పాఠక్ , అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.