![పోలింగ్ సెంటర్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rajiv-gandhi-hanuman-ordered-separate-polling-centers-for-graduates-and-teachers_LCKNEbaV3F.jpg)
రెంజల్/నిజామాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేసే గ్రాడ్యుయేట్లు, టీచర్ల కోసం పోలింగ్సెంటర్లు వేరుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన రెంజల్గవర్నమెంట్హై స్కూల్లో ఏర్పాటు చేసిన సెంటర్ విజిట్ చేశారు. ఎలక్షన్కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పోలింగ్ సెంటర్ల వద్ద వసతులు కల్పించాలన్నారు. కరెంట్, నీటి సరఫరా, టాయిలెట్స్, ర్యాంపు ఉండేలా చూడాలన్నారు. మన ఊరు -మన బడిలో భాగంగా నిర్మించిన కొత్త క్లాస్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు.
సర్కారు హాస్టళ్లకు పాత బియ్యం
కొత్త బియ్యంతో తయారు చేసిన అన్నం మెత్త సుద్దలా ఉంటోందని సర్కారు హాస్టళ్లన్నింటికీ పాతబియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సివిల్ సప్లై డీఎం అంబాదాస్ను ఆదేశించారు. శుక్రవారం రెంజల్లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన విజిట్ చేశారు. ఫ్రెష్ కూరగాయలతో వంటలు చేయాలని, ఈగలు, దోమల రాకుండా పరిసరాలు నీట్గా ఉంచాలని వార్డెన్ ప్రిన్సిపాల్ అర్షియా నజమ్కు సూచించారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్కు డైట్ అందేలా చూడాలన్నారు. ఇన్చార్జి తహసీల్దార్ శ్రావణ్ తదితరులు ఉన్నారు.