నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : రాజీవ్ గాంధీ హనుమంతు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో ఎక్కడా  నకిలీ విత్తనాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. గట్టి నిఘా ఏర్పాటు చేశామని నకిలీ, నాసిరకం సీడ్​పై రైతులకు అగ్రికల్చర్​ ఆఫీసర్లతో అవగాహన కల్పిస్తున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  రెవెన్యూ, పోలీస్​, అగ్రికల్చర్​ ఆఫీసర్లతో కూడిన  మండల కమిటీలు తనిఖీలు చేస్తున్నాయన్నారు. ఆర్మూర్​ మండలం సుబ్బిర్యాల్​ విలేజ్​లో అనధికారికంగా నిలువ ఉంచిన 5,540  కిలోల వరి విత్తనం, 360 కిలోల మొక్కజొన్న, 810 కిలోల సోయాబీన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

 రూ.14,825 విలువైన గడువు దాటిన ఉల్లి, వెజిటెబుల్​సీడ్​ను ఆర్మూర్​లోని బాలాజీ సీడ్స్​నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు.  అనుమతించిన డీలర్ల నుంచి మాత్రమే  రైతులు విత్తనం కొనుగోలు చేయాలని తప్పక రశీదులు తీసుకోవాలన్నారు.  రశీదుపై  రైతు పేరు, పంట పేరు, సీడ్​వెరైటీ, లాట్​నంబర్ తదితర వివరాలు తప్పక రాయించాలన్నారు.  పంట కోతలు ముగిసేదాకా రశీదుతో పాటు ఖాళీ సీడ్​ బ్యాగ్​ను భద్రంగా పెట్టుకోవాలన్నారు.  విత్తన లోపంతో రైతుకు నష్టం జరిగితే వీటిని సాక్ష్యంగా ఉపయోగించే వీలుంటుందన్నారు.