ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ట్రైనింగ్ : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ట్రైనింగ్ : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు:  ఎమ్మెల్సీ ఎన్నికలను అవగాహనతో నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శనివారం ఆయన అంబేద్కర్​ భవన్​లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పీవో,  ఏపీవోల మొదటి విడత ట్రైనింగ్​ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ఏమైనా అనుమానాలు ఉంటే  మాస్టర్​ ట్రైనర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు.  27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4  గంటల వరకు పోలింగ్​ నిర్వహించాలన్నారు. 

 ఆ టైంలోపు సెంటర్​కు చేరిన ఓటర్లను క్యూలో నిలబెట్టి టోకెన్ నంబర్లు ఇవ్వాలన్నారు.  26న ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్​ కేంద్రాలకు చేరుకోవాలని పోలింగ్​ సెంటర్లలోకి సెల్​ఫోన్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్​తర్వాత బ్యాలెట్​బాక్స్ లను  కరీంనగర్‌‌లోని కౌంటింగ్​సెంటర్​ రిసిప్షన్ పాయింట్​లో అందించే బాధ్యత పీవోలదేనన్నారు.  రికార్డు బుక్​లో వివరాలు పక్కాగా ఎంటర్​ చేయాలన్నారు.  మాస్టర్​ ట్రైనర్స్​ హన్మాండ్లు, వర్మ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​తో సిబ్బందికి అవగాహన కల్పించారు.  నిజామాబాద్​ ఆర్డీవో రాజేంద్రకుమార్​, తహసీల్దార్లు పాల్గొన్నారు.