- కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
(జక్రాన్పల్లి)నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ హస్పిటల్స్లో అన్ని రకాల ట్రీట్మెంట్ వసతులున్నాయని, రోగుల నమ్మకం పెంచేలా సర్వీస్ అందించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం జక్రాన్పల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. డాక్టర్లు, స్టాఫ్ టైంకు వస్తున్నారా అని ఆరా తీశారు. సీబీపీ మెషిన్ను రెగ్యూలర్గా వాడాలని అన్ని రకాల మెడిసిన్స్ను అందుబాటులో ఉంచుకోవాలని కాలం చెల్లిన మెడిసిన్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసి వాటి స్థానంలో కొత్త మందులు తెప్పించుకోవాలన్నారు.
ఇన్పేషెంట్ వార్డు, ల్యాబ్, వాక్సినేషన్ రూమ్ డ్రగ్ స్టోర్ను పరిశీలించారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్గాంధీ కిచెన్, డార్మెటరీ, డైనింగ్ సెక్షన్లు పరిశీలించారు. పిల్లలకు వడ్డించడానికి రెడీ చేసిన వంటల నాణ్యతను చెక్ చేశారు. రైస్, కూరగాయలను ఇష్టమొచ్చిన రీతిలో ఎందుకు పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని పెట్టాలన్నారు. సుద్దులం జడ్పీ స్కూల్విజిట్ చేసిన మధ్యలో ఆగిపోయిన ఇంకుడుగుంత పనులు పూర్తి చేయాలని పీఆర్ ఇంజినీర్లను ఆదేశించారు. టెన్త్ రిజల్టు వంద శాతం వచ్చేలా టీచర్లు కృషి చేయాలన్నారు.