
- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ఎడపల్లి, వెలుగు : మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అర్హులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో కుటుంబాలు ఎన్ని ? ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరయ్యాయి అని అధికారులను ప్రశ్నించారు. 125 మందికి ఇండ్లు మంజూరు కాగా, 25 ఇండ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. మిగతావాటిని త్వరగా ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
అనంతరం ఎడపల్లి లోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, ఎడపల్లి తహసీల్దార్ దన్వాల్, ఎంపీడీవో శంకర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గంగాశంకర్ తదితరులు ఉన్నారు.