నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్​ను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్​ను పరిశీలించిన కలెక్టర్
  • మొత్తం ఓట్లు 255, పోలైనవి 195 ​ 

నిజామాబాద్, వెలుగు : టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్​ ఓటింగ్​ను మంగళవారం కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు పరిశీలించారు. కలెక్టరేట్​ లోని  ఎన్​ఐసీ హాల్​లో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి  ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్​లో పోస్టల్​ బ్యాలెట్​ పొందిన ఉద్యోగులు  ఓటు వేసి సీల్​ చేసిన బాక్స్​లో కవర్ వేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొనే టీచర్లు, గ్రాడ్యుయేట్లు మొత్తం 255 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వగా, 195 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​ డ్యూటీ వేసిన లెటర్, ఐడీ కార్డును పరిశీలించాక ఓటు వేసేందుకు అనుమతించారు. పోలీస్​ బందోబస్తు మధ్య ఓటింగ్​ జరుగగా,  బాక్స్​లను కరీంనగర్ కౌంటింగ్ సెంటర్​కు తరలించారు.