గవర్నమెంట్​ ల్యాండ్​ కబ్జాలపై కలెక్టర్​ సీరియస్

గవర్నమెంట్​ ల్యాండ్​ కబ్జాలపై కలెక్టర్​ సీరియస్
  • ప్రభుత్వ భూమి కబ్జాలపై చర్యలు తీసుకోండి
  • కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు 

నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ భుముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ రెసిడెన్సియల్​ స్కూల్​, హాస్టల్​ నిర్మాణాలకు స్థలాలను ఆయన పరిశీలించారు. అవసరమైన స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. 

నగర శివారులోని గుండారం, నాగారం ఏరియాలో భూములు కబ్జా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కబ్జాలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ బాలరాజును ఆదేశించారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్​ తదితరులు ఉన్నారు.