ఎల్ఆర్ఎస్​పై ఫోకస్​ పెట్టాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు

ఎల్ఆర్ఎస్​పై ఫోకస్​ పెట్టాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో నాన్​ లేఅవుట్​ ప్లాట్ల రెగ్యులైజేషన్​పై ఫోకస్​ పెట్టాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు కోరారు. మార్చి 31లోపు ఇంటి జాగలు రెగ్యులరైజ్​​ చేసుకునే వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఉన్నట్లు ప్రచారం చేయాలన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్లో జిల్లాలోని మున్సిపల్​ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడారు.  

ఎల్​ఆర్​ఎస్​ కోసం కొత్త అప్లికేషన్​లు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. సందేహాలు తీర్చడానికి ఇందూర్​, బోధన్​, ఆర్మూర్​, భీంగల్​ మున్సిపల్​ ఆఫీస్​లలో హెల్ప్​లైన్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్​లో 08462-220183 కంట్రోల్​ రూమ్​ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 2020 ఆగస్టు 26లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఇప్పటిదాకా ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ ఇంప్లిమెంట్​ అయిందని, ఇక కొత్త అప్లికేషన్​లకు గవర్నమెంట్ చాన్స్​ ఇచ్చిందన్నారు.

పాత దరఖాస్తులను నిబంధనలకు లోబడి త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్​, బోధన్ సబ్​ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్​, ఆర్డీవో రాజేంద్రకుమార్​ తదితరులు ఉన్నారు. అంతకు ముందు స్టేట్ చీఫ్​ సెక్రటరీ శాంతికుమారి నిర్వహించిన వీసీలో కలెక్టర్​ పాల్గొన్నారు.