
స్టేషన్ఘన్పూర్, వెలుగు: భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన అమలులో భాగంగా స్థానిక పాత బస్స్టాండ్నుంచి రైతువేదిక వరకు సోమవారం వాటర్షెడ్ర్యాలీ ఏర్పాటు చేయగా, కలెక్టర్ ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ సించాయీ యోజన కింద రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 35 ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 248 గ్రామాలు ఎంపికకాగా, అందులో జనగామ జిల్లా నుంచి తాటికొండ గ్రామం ఎంపికైందని తెలిపారు. భూమిలోకి ఇంకగా మిగిలిన వర్షపు నీటిని నిల్వ చేసేందుకుగాను చెక్డ్యామ్స్, రాతి డ్యామ్స్, ఊటకుంటలు నిర్మిస్తారని అన్నారు.