
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్దుకాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కావేరీ, సాయిరాం ఫర్టిలైజర్స్, జేకేఎస్ అగ్రిమాల్లో ఎరువుల నిల్వలను, రిజిస్టర్లను పరిశీలించారు. సాయిరాం ఫర్టిలైజర్ దుకాణంలో స్టాక్ డిస్ప్లే లేకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్రామారావును ఆదేశించారు.
అంతకుముందు కలెక్టరేట్లో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి హాజరయ్యారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ టైంలో, ఆ తర్వాత నిర్వహించాల్సిన విధులపై పవర్ పాయింట్ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్లతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ రిజ్వాన్ మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
కలెక్టర్కు ఆహ్వానం
జనగామ/పాలకుర్తి: మహా శివరాత్రి సందర్భంగా పాలకుర్తి సోమేశ్వరాలయంలో ఈనెల 26న నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్రిజ్వాన్ బాషా షేక్ ను ఆలయ ఈవో మోహన్బాబు, అర్చకులు డీవీఎస్ శర్మ, సూపరింటెండెంట్వెంకటయ్య ఆహ్వానించారు. నేటి నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయని వారు తెలిపారు. అంతకుముందు వచ్చే నెల 6 నుంచి 14 వరకు నిర్వహించనున్న చిల్పూరు బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను కలెక్టర్ ఈవో లక్ష్మీ ప్రసన్న, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.