
జనగామ అర్బన్, వెలుగు : మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ట్రాన్స్ జెండర్లు ఉపయోగించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల కోసం అన్ని జిల్లాల్లో మైత్రి క్లినిక్లను ప్రారంభించినట్టు తెలిపారు. జిల్లా లోని ప్రభుత్వ జనరల్ హస్పిటల్లో ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ప్రారంభించారు. ఉన్న ట్రాన్స్ జెండర్లకు ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే క్లినిక్ కు రావాలని చెప్పారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో డి. ఫ్లోరెన్స్, డిప్యూటీ డీఎంహెచ్వో రవీందర్, సీడీపీవో రమాదేవి పాల్గొన్నారు.