ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవు : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవు : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఆహార భద్రత పాటించకపోతే చర్యలు చర్యలు తప్పవని, నిబంధనలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆహార పరిరక్షణ, ప్రమాణాల శాఖ ఆధ్వర్యంలో అడిషనల్​కలెక్టర్​ రోహిత్​ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి ఆహార భద్రతపై మీటింగ్​ నిర్వహించారు. 

ఆహార భద్రతపై ఆహార తయారీ, విక్రయదారులకు ముందుగా అవగాహన కార్యక్రమం చేపట్టాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. టాస్క్​ఫోర్స్​ బృందం ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో మల్లికార్జున రావు, ఫ్లోరెన్స్, డీఏవో రామారావు నాయక్, మున్సిపల్​కమిషనర్ వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, వినీల్, సాధిక్​ అలీ తదితరులు పాల్గొన్నారు.