నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు : కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు : కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ తెలిపారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామ శివారులోని కస్తూర్భా గాంధీ గర్ల్స్​ స్కూల్​ను గురువారం కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్​లోని టీచింగ్​ స్టాఫ్​ అటెండెన్స్​ రిజిస్టర్​, స్టాక్​ రిజిస్టర్​ను పరిశీలించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను స్టూడెంట్లకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. 

స్కూల్​లోని రూమ్స్​ తలుపులు, కిటికీల   పనులు సత్వరమే పూర్తిచేయాలని ఇంజనీరింగ్​ ఆఫీసర్లకు గట్టిగా చెప్పారు. చదువులో ప్రతిభ కనబరచాలని, 100 శాతం ఫలితాలను సాధించాలని స్టూడెంట్స్​కు సూచించారు. ఆర్​డీవో వెంకన్న, డిప్యూటీ కలెక్టర్​ సుహాసిని, కేజీబీవీ స్పెషల్​ ఆఫీసర్​ ప్రశాంతి, ఎంపీడీవో వెంకన్న, తహసీల్దార్​ సరస్వతీ, డీటీ రామారావు, పాల్గొన్నారు.