రోడ్డు ప్రమాదాలను నివారించాలి

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

జనగామ, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో డీసీపీ రాజమహేంద్ర నాయక్​తో కలిసి జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నేషనల్​ హైవేలు, ఇతర రోడ్ల కనెక్టివిటీ వద్ద స్పీడ్​ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చాన్స్​ చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్, సిద్దిపేట వైపు నేషనల్​ హైవేలపై పెండింగ్​ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏఎస్పీ పండరి చేతన్​ నితిన్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్​ గౌడ్, మున్సిపల్​ కమిషనర్​ వెంకటేశ్వర్లు, ఘన్​పూర్  ఏసీపీ భీం శర్మ తదితరులు పాల్గొన్నారు.​ 

కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం.. 

జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ప్రారంభించారు. మార్క్​ఫెడ్​ ద్వారా క్వింటాలుకు రూ.7,550 ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఏఈవో వద్ద ధ్రువీకరణ పత్రంతోపాటు తమ పట్టాదారు పాసుబుక్, ఆధార్​ కార్డు, బ్యాంక్​ అకౌంట్​ జిరాక్స్​లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిల్లా మార్క్​ ఫెడ్​ అధికారి రంజిత్​ రెడ్డి, మార్కెటింగ్​అధికారి నరేందర్, మార్కెట్​సెక్రటరీ శ్రీనివాస్, అగ్రికల్చర్​ ఆఫీసర్​ రామారావు తదితరులు పాల్గొన్నారు.