ఎల్‌ఆర్‌‌ఎస్ పూర్తయితేనే  నిర్మాణ అనుమతులు :కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్

ఎల్‌ఆర్‌‌ఎస్ పూర్తయితేనే  నిర్మాణ అనుమతులు :కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు:  ఎల్​ఆర్​ఎస్​ కింద రెగ్యులరైజ్ చేసుకున్న వారికే నిర్మాణాలకు అనుమతులు వస్తాయని , మార్చి 31 లోగా ఎల్​ఆర్​ఎస్​ రుసుము చెల్లించిన వారికే 25% తగ్గింపు ఉంటుందని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. గురువారం మున్సిపల్​ ఆఫీస్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  కలెక్టర్​ మాట్లాడుతూ...  జిల్లాలో 62 వేల దరఖాస్తులు ఎల్​ఆర్​ఎస్‌కు వచ్చాయన్నారు.

మున్సిపాలిటీలో 16 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. కలెక్టరేట్​ఆఫీసుల్లో హెల్ప్​ డెస్క్​లు పెట్టామన్నారు.  సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో  99481 87334 మున్సిపల్​ ఆఫీస్​లో  89782 07205 లో సంప్రదించవచ్చని తెలిపారు.  జనగామ ఆర్డీవో గోపిరాం, డీటీసీపీవో వీరస్వామి, మున్సిపల్​ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సబ్​ రిజిస్టార్లు, తహసీల్దార్లు, రియల్​ ఎస్టేటర్లు, మున్సిపల్​ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.