
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందించే ఫ్రీ ఇసుకకు కేవలం ట్రాన్స్పోర్టు చార్జీలు మాత్రమే తీసుకోవాలన్నారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇండ్లను ఈ పథకంలో చేర్చొద్దని సూచించారు.
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్కుమార్, డీఆర్డీవో శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్కు కలెక్టర్ అభినందన
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన స్టూడెంట్స్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా అభినందించారు. వేములవాడ మైనార్టీ సంక్షేమ గురుకుల స్కూల్కు చెందిన హేమంత్ ఎంఎల్టీ కోర్సులో 500కు 496 మార్కులతో స్టేట్ఫస్ట్ ర్యాంకు, షరీఫ్ ఎంఎల్డీటీలో 483 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లతోపాటు గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ పి.లక్ష్మీనారాయణ, లెక్చరర్లను అభినందించారు.