రాజన్న సిరిసిల్ల, వెలుగు: పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి పరిశీలించారు. సిలబస్ ఎక్కడి వరకు పూర్తి అయిందని ప్రిన్సిపాల్ ను ఆరా తీశారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.