
- 2,403 లీటర్ల మద్యం పట్టివేత
సంగారెడ్డి, వెలుగు : జిల్లాలో ఎలక్షన్రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ రూపేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పొలిటికల్ పార్టీలతో పాటు ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు, సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించామన్నారు. బార్డర్ ప్రాంతాల్లో 9 చెక్ పోస్టులు, ఇంటర్నల్గా 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.1,61,74,480లను సీజ్ చేయగా మరో 14 .80 లక్షలను ఇన్కాంటాక్స్స్వాధీనం చేసుకున్నామన్నారు.
1,819 మంది బైండోవర్
జిల్లాలో ఇప్పటివరకు 1,819మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ రూపేశ్ తెలిపారు. రూ. కోటి 61 లక్షల పైబడి నగదు సీజ్ చేయగా 2,403 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకునీ 187 కేసులు నమోదు చేశామన్నారు. మరో 1,000 మందిని బైండోవర్ కేసులు గుర్తించి దశల వారిగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రాల పోలీస్ యాంత్రాంగాలతో సమావేశమై శాంతి, భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లపై నిఘా పెట్టి జీసీఎస్ ట్రాకింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ మెంచు నగేశ్ పాల్గొన్నారు.