
ముదిగొండ, వెలుగు: ఈ నెలాఖరులోగా యువ వికాసం అప్లికేషన్ల వెరిఫికేషన్పూర్తవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. గురువారం ముదిగొండ ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలనను తనిఖీ చేశారు. మండలానికి సంబంధించి ఆన్ లైన్ ద్వారా 3,280 , ఆఫ్ లైన్ ద్వారా 1,955 అర్జీలు వచ్చాయనిని, ఇప్పటివరకు 1,243 దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి చేశామని ఎంపీడీవో శ్రీధర్ స్వామి ఆమెకు వివరించారు.
యువతకు ఉపాధి దొరికేలా యూనిట్ల ఏర్పాటు జరగాలని ఇన్చార్జి కలెక్టర్పేర్కొన్నారు. లాభసాటి యూనిట్ల గ్రౌండింగ్కు చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరిస్తే కారణాలు చెప్పాలన్నారు. తహసీల్దార్ సునీత ఎలిజబెత్ తదితరులున్నారు.