ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ శ్రినివాస్ రెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ శ్రినివాస్ రెడ్డి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచొద్దని  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడారు.    ప్రజావాణి  అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించి వారంలోగా రిపోర్ట్ తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు.    మొత్తం  56  అర్జీలు వచ్చినట్టు తెలిపారు.  ఈ కార్యక్రమం లో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: హైదరాబాద్ కాంగ్రెస్​ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు

మెదక్​ టౌన్​:  కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​ రాజర్షిషా, డీఆర్​ఓ పద్మశ్రీతో తో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 53 ఆర్జీలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ధరణి సమస్యలపై 28, గృహలక్ష్మి కోసం 4, దళిత బంధు 8, ఉపాధి  అవకాశాలకోసం  6, ఇతర అంశాలకు సంబంధించి 8 ఆర్జీలు ఉన్నాయి.   ఉద్యోగులు , ప్రజలకోసం  కలెక్టరేట్ మొదటి అంతస్తులో  మహిళా సమాఖ్య  ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన క్యాంటీన్ ను  కలెక్టర్ రాజర్షి షా , అడిషనల్​ కలెక్టర్​   రమేశ్​ , వెంకటేశ్వర్లు తో కలిసి ప్రారంభించారు.