బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : 35 ఏండ్లు నిండిన మహిళలందరూ ఏటా విధిగా బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన 2 కే రన్​ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని, దీనిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ప్రాథమిక స్థాయిలోనే వ్యాధిని గుర్తిస్తే నివారించవచ్చని తెలిపారు. 35 ఏండ్లు నిండిన మహిళలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ టెస్ట్ , మెమోగ్రామ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ కు ఐదు రకాల ట్రీట్​మెంట్లు ఉంటాయని, దశలను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్​మెంట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మెడికల్ కళాశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ భట్, సత్యనారాయణ, రమేశ్, యశ్వంత్, ఈశ్వరమ్మ, రాకేశ్ చంద్ర, పావని, రూత్, సునీత, భూలక్ష్మి పాల్గొన్నారు.