
ఉప్పునుంతల, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను వెంటనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్, జడ్పీ హైస్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. స్కూల్ విద్యార్థులను ప్రశ్నలడిగి వారిని అభినందించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. మండలంలోని 33 స్కూళ్లలో చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్టూడెంట్లకు బుక్స్ పంపిణీ చేశారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఆర్డీవో మాధవి, ఎంపీడీవో బాలచంద్ర సుజన్ ఉన్నారు.