
కొత్తపల్లి, వెలుగు: ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు కొత్తపల్లి పట్టణంలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్ సీహెచ్ సతీశ్రావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను బుధవారం ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ జులైలో జరిగిన ఎగ్జామ్ రిజల్ట్స్ఇటీవల విడుదల కాగా తమ కాలేజీ నుంచి 10 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. ఇప్పటివరకు తమ కాలేజీ నుంచి 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు.